తాళం వేసిన ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఫోన్

తాళం వేసిన ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఫోన్
  • తలుపులు బద్దలు కొట్టి చూసిన పోలీసులకు షాక్
  • భార్య భర్తల మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు
  • హత్య చేశారా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా...?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తాడేపల్లి పరిధిలోని ఓ నివాసం నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు ఫోన్ వచ్చింది. ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూస్తే షాక్. దుర్వాసనతో ముక్కుపుటాలు అదిరిపోయాయి. రెండు మృతదేహాలు ఇంట్లో కనిపించాయి. దుస్తుల ఆధారంగా.. భార్యా భర్తలు అయి ఉండవచ్చని తెలుస్తోంది. 
ఇంటికి తాళలాలు వేసుకొని ఆత్మహత్య కి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు అయివుండొచ్చని పోలీసుల భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా హత్య చేశారా.. లేక వీరే ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్నది పోస్టుమార్టం నివేదికలో క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.